ఎన్డీఏలోకి తెలుగుదేశం?.. రిపబ్లిక్ ఛానెల్ కథనం

ABN , First Publish Date - 2022-08-31T03:37:39+05:30 IST

న్యూఢిల్లీ: ఎన్డీఏ గూటికి టిడిపి రానుందా? త్వరలో ఎన్డీఏలో టిడిపి చేరే అవకాశం ఉందని జాతీయ మీడియా కథనాలు వెలువరిస్తోంది.

ఎన్డీఏలోకి తెలుగుదేశం?.. రిపబ్లిక్ ఛానెల్ కథనం

న్యూఢిల్లీ: ఎన్డీఏ గూటికి టిడిపి రానుందా? త్వరలో ఎన్డీఏలో టిడిపి చేరే అవకాశం ఉందని జాతీయ మీడియా కథనాలు వెలువరిస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విషయంపై మాట్లాడుకున్నారంటూ రిపబ్లిక్ ఛానెల్ కథనం ప్రసారం చేసింది. ఇప్పటికే టీడీపీ, బీజేపీ మధ్య పొత్తుకు సంబంధించి చర్చలు కూడా జరిగాయని కథనంలో తెలిపింది. టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు అనేక కోణాల్లో ప్రభావం చూపిస్తుందని కథనంలో వెల్లడించింది. పొత్తుపై ఢిల్లీలోనూ విస్తృత చర్చలు జరుగుతున్నాయి. తాజా పరిణామాలు వైసీపీని కలవరపాటుకు గురిచేస్తున్నాయని పరిశీలకులంటున్నారు.  


2019 పార్లమెంట్ ఎన్నికలకు ముందే టీడీపీ-బీజేపీ పొత్తు తెంచుకున్నాయి. ప్రత్యేక హోదా ఇవ్వలేదనే కారణంతో టీడీపీ ఎన్డీయేకు గుడ్‌బై చెప్పింది. 2024 పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో మళ్లీ పొత్తుపెట్టుకుంటున్నాయని సమాచారం. పొత్తు కారణంగా రెండు పార్టీలూ లబ్ది పొందుతాయని, పార్లమెంట్‌ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ రెండు పార్టీలూ ప్రయోజనం పొందగలుగుతాయని పరిశీలకులు చెబుతున్నారు.  

Updated Date - 2022-08-31T03:37:39+05:30 IST