జగన్.. ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారు: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-04-12T00:07:47+05:30 IST

జగన్.. ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారు: చంద్రబాబు

జగన్.. ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారు: చంద్రబాబు

నెల్లూరు: వెనుక బడిన వర్గాల వారిని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇబ్బందులకు గురిచేయడంతో పాటు రిజర్వేషన్లను నిర్వీర్యం చేస్తున్నారని, ఏ మొహం పెట్టుకుని బీసీలను ఓటు అడుగుతారని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని ఎస్కేఎస్ కల్యాణ మండపంలో టీడీపీ శ్రేణులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రతి ఒక్కరూ జ్యోతిరావు పూలేను ఆదర్శంగా తీసుకోవాలని చంద్రబాబు సూచించారు. టీడీపీ బడుగు, బలహీన వర్గాల పార్టీ అని అన్నారు. తన రాజకీయ చరిత్రలో బీసీ సంక్షేమమే ధ్యేయంగా పని చేశానని చంద్రబాబు పేర్కొన్నారు

Updated Date - 2021-04-12T00:07:47+05:30 IST