రైతులకు చంద్రబాబు ధైర్యం

ABN , First Publish Date - 2020-11-30T02:09:59+05:30 IST

నివర్ తుపాను ప్రాంతాల టీడీపీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా కోవూరు, గుడివాడ రైతులతో మాట్లాడి చంద్రబాబునాయుడు వారికి..

రైతులకు చంద్రబాబు ధైర్యం

అమరావతి‌: నివర్ తుపాను ప్రాంతాల టీడీపీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా కోవూరు, గుడివాడ రైతులతో మాట్లాడి చంద్రబాబునాయుడు వారికి  ధైర్యం చెప్పారు. విపత్తుల నుంచి కాపాడే వ్యవస్థలను వైసీపీ ప్రభుత్వం ధ్వంసం చేసిందని చంద్రబాబు దుయ్యబట్టారు.


క్రాప్ ఇన్సూరెన్స్ ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని నమ్మించి  ప్రభుత్వం మోసం చేసిందన్నారు. చివరికి ప్రీమియం కట్టకుండా రైతులను ఆందోళనలో పడేశారని,  గాలిలో తిరగడం, కబుర్లు చెప్పడం తప్ప జగన్‌ చేసింది శూన్యమని సీఎం తీరుపై మండిపడ్డారు. ఏడాదిన్నరగా వైసీపీ ప్రభుత్వం రైతుల జీవితాలతో ఆడుకుంటోంది తప్ప ఎలాంటి న్యాయం చేయలేదన్నారు. ఇన్‌పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్ ఎగ్గొట్టారు, విపత్తు పరిహారం ఇవ్వకుండా రైతులను జగన్ మోసం చేస్తున్నారన్నారు. రైతు సమస్యలపై టీడీపీ పోరాడుతుందని తెలిపారు. 

Updated Date - 2020-11-30T02:09:59+05:30 IST