కలికిరి చేరుకున్న చంద్రబాబు

ABN , First Publish Date - 2022-07-07T06:10:28+05:30 IST

టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు రాత్రి 9.30 గంటలకు కలికిరి చేరుకున్నారు.

కలికిరి చేరుకున్న చంద్రబాబు
కల్యాణ మండపం దగ్గర చంద్రబాబుకు స్వాగతం పలుకుతున్న నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి

కలికిరి, జూలై 6: టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు రాత్రి 9.30 గంటలకు కలికిరి చేరుకున్నారు. మదనపల్లెలో మినీ మహానాడు సభలో పాల్గొన్న అనంతరం ఆయన గురువారం కలికిరిలో సమీక్షా సమావేశాలు జరగబోయే హేమాచారి కల్యాణ మండపానికి నేరుగా చేరుకున్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి, ఆయన కుమారుడు టీడీపీ యువ నేత నల్లారి అమరనాఽథ రెడ్డి, రాజంపేట పార్లమెంటు అధ్యక్షుడు ఆర్‌.శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షుడు వాసునూరి చంద్రశేఖర్‌, టీడీపీ నేత గంటా నరహరి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ కంభం నిరంజన్‌ రెడ్డి తదితరులు చంద్రబాబుకు ఘనంగా స్వాగతం పలికారు. రాత్రికి ఇక్కడే బస చేస్తున్నావు కదా అని చంద్రబాబు గంటా నరహరిని వాకబు చేశారు. అనంతరం అంతా కలిసి చంద్రబాబుతో పాటు బస్సులోకి వెళ్ళి కొద్దిసేపటి తరువాత తిరిగి వచ్చేశారు. గురువారం ఉదయం కిశోర్‌కుమార్‌ రెడ్డి ఇంట్లో అల్పాహారం కోసం చంద్రబాబును ఆహ్వానించారు. దీనికి ఆయన నగరిపల్లె (కిశోర్‌ స్వగ్రామం) వెళ్లడానికి అంగీకరించారు. ఈ మేరకు సమీక్షా సమావేశాల్లో పాల్గొనే ముందు చంద్రబాబు నగరిపల్లెకు వెళ్లనున్నారు.  

Updated Date - 2022-07-07T06:10:28+05:30 IST