బాబును హైదరాబాద్ పంపేందుకు పోలీసుల యత్నం.. ఉత్కంఠ
ABN , First Publish Date - 2021-03-01T18:14:35+05:30 IST
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును రేణిగుంట..
చిత్తూరు : టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును రేణిగుంట ఎయిర్పోర్టు నుంచి హైదరాబాద్కు తిరిగి పంపేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. మధ్యాహ్నం హైదరాబాద్ పంపేందుకు పోలీసులు టికెట్లు రిజర్వు చేశారు. మధ్యాహ్నం 3:10 గంటలకు స్పైస్జెట్లో పంపేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. అయితే.. చంద్రబాబు ప్రయాణించాల్సిన విమానం పూర్తిగా నిండిపోయింది. దీంతో బాబు ప్రయాణంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
మరోవైపు.. సొంత జిల్లాలో చంద్రబాబును పర్యటించకుండా అడ్డంకులు సృష్టించడం దురదృష్టకరమని.. ఎస్ఈసీ అనుమతితో చిత్తూరుకు వెళితే ఎయిర్పోర్టులోనే నిర్బంధిస్తారా..? అంటూ ప్రభుత్వం, పోలీసుల తీరుపై టీడీపీ నేతలు, వీరాభిమానులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా.. చంద్రబాబును తిరుపతిలోని రేణిగుంట ఎయిర్పోర్టులో పోలీసులు అడ్డుకున్న విషయం విదితమే. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ ఎయిర్పోర్టులోనే బాబు బైఠాయించారు. ఇంకా బాబు నిరసన కొనసాగిస్తున్నారు.