మహానాడు నిర్వహణపై చంద్రబాబు సమీక్ష

ABN , First Publish Date - 2022-05-23T22:36:22+05:30 IST

మహానాడు నిర్వహణపై చంద్రబాబు సమీక్ష

మహానాడు నిర్వహణపై చంద్రబాబు సమీక్ష

అమరావతి: మహానాడు నిర్వహణపై టీడీపీ అధినేత చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. 40 ఏళ్ల ప్రస్థానం చాటేలా, భవిష్యత్ ప్రయాణాన్ని నిర్ధేశించేలా మహానాడు ఉండాలని సూచించారు. మొదటి రోజు ప్రతినిధుల సభకు 12 వేల మందికి ఆహ్వానం ఇవ్వనున్నట్లు తెలిపారు. రెండో రోజు అదే ప్రాగణంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. పార్టీ భవిష్యత్ ప్రయాణంపై దిశా నిర్ధేశం చేసేలా మహానాడు కార్యక్రమం ఉండాలన్నారు. వివిధ వర్గాల నుంచి వస్తున్న స్పందన చూస్తే ప్రభంజనంలా మహానాడు ఉండబోతోందన్నారు. ప్రభుత్వం అడ్డంకులు సృష్టించినంత మాత్రాన మహానాడు ఆగదన్నారు. 

Updated Date - 2022-05-23T22:36:22+05:30 IST