టీడీపీ నేతలపై ఇంత దౌర్జన్యమా?: చంద్రబాబు
ABN , First Publish Date - 2021-08-16T19:46:26+05:30 IST
పరామర్శకు వెళ్లిన టీడీపీ నేతలపై ఇంత దౌర్జన్యమా? అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. టీడీపీ నేతల పట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించడం సరికాదని తప్పుబట్టారు
అమరావతి: పరామర్శకు వెళ్లిన టీడీపీ నేతలపై ఇంత దౌర్జన్యమా? అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. టీడీపీ నేతల పట్ల పోలీసులు అమానుషంగా వ్యవహరించడం సరికాదని తప్పుబట్టారు. పోలీసుల దౌర్జన్యం ప్రజాస్వామ్య విలువలకు గండికొట్టేలా ఉందన్నారు. దౌర్జన్యానికి పాల్పడ్డ పోలీసులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. హత్యకు గురైన దళిత విద్యార్థిని కుటుంబానికి రూ.కోటి పరిహారం ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
విద్యార్థిని రమ్య కుటుంబ సభ్యుల పరామర్శలో అడుగడుగునా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. పరామర్శకు వెళ్లిన టీడీపీ నేత నారా లోకేష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. లోకేష్తో పాటు టీడీపీ నేతలు ధూళిపాళ్ల, ఆలపాటి రాజా, నక్కా ఆనందబాబును అరెస్ట్ చేశారు. లోకేష్ను ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్కు పోలీసులు తరలించారు. మరికొందరు టీడీపీ నేతలు నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలించారు.