AP News: విలువలతో కూడిన సమాజ స్థాపన చేయాలి: చంద్రబాబు
ABN , First Publish Date - 2022-08-15T20:38:14+05:30 IST
విలువలతో కూడిన సమాజ స్థాపన చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఆకాంక్షించారు.
గుంటూరు: విలువలతో కూడిన సమాజ స్థాపన చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) ఆకాంక్షించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక అసమానతలు లేని సమాజాన్ని నిర్మించాలని వ్యాఖ్యానించారు. యువతకు అవకాశాలు కల్పించాలని, దేశంలో సంపద సృష్టిచేసి పేద ప్రజలకు పంచాలని అభిప్రాయపడ్డారు. రైతుల కోసం ప్రత్యేకమైన విధానాలు తీసుకురావాలని చంద్రబాబు కోరారు.