AP News: మూడ్రోజులుగా చంద్రబాబు వరుస సమీక్షలు

ABN , First Publish Date - 2022-08-20T02:36:15+05:30 IST

మూడ్రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) వరుస సమీక్షలు చేస్తున్నారు. ఇప్పటివరకు 14 అసెంబ్లీ సెగ్మెంట్ల ఇన్‌చార్జ్‌లతో చంద్రబాబు

AP News: మూడ్రోజులుగా చంద్రబాబు వరుస సమీక్షలు

అమరావతి: మూడ్రోజులుగా టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) వరుస సమీక్షలు చేస్తున్నారు. ఇప్పటివరకు 14 అసెంబ్లీ సెగ్మెంట్ల ఇన్‌చార్జ్‌లతో చంద్రబాబు భేటీలు నిర్వహించారు. సీట్ల కేటాయింపులో పనితీరే ప్రామాణికమని నేతలకు ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. గెలిచే వారికే టికెట్లు ఇస్తామని స్పష్టం చేస్తున్నారు. సీనియార్టీ, సమీకరణాల పేర్లతో టికెట్లు వస్తాయనుకోవద్దంటూ.. నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లకు టీడీపీ అధినేత తేల్చి చెప్పారు. నేతలను యాక్టివేట్ చేసేందుకే వన్ టూ వన్ భేటీలు నిర్వహిస్తున్నారు. రానున్న రోజుల్లో ఇదే తరహా చంద్రబాబు  రివ్యూలు చేపట్టనున్నారు. నేతల పనితీరుపై 3 నెలలకోసారి చంద్రబాబు సమీక్ష చేపట్టనున్నారు.

Updated Date - 2022-08-20T02:36:15+05:30 IST