రేపు విశాఖకు చంద్రబాబు

ABN , First Publish Date - 2021-03-05T02:27:12+05:30 IST

శుక్రవారం విశాఖకు టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లనున్నారు. రేపటి రాష్ట్ర బంద్‌కు సంఘీభావం చంద్రబాబు తెలపనున్నారు.

రేపు విశాఖకు చంద్రబాబు

అమరావతి: శుక్రవారం విశాఖకు టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లనున్నారు. రేపటి రాష్ట్ర బంద్‌కు సంఘీభావం చంద్రబాబు తెలపనున్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా శుక్రవారం రాష్ట్రవ్యాప్త బంద్ నిర్వహిస్తున్నారు. ఆ తర్వాత ఎల్లుండి విశాఖలో ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఇప్పటికే విశాఖ ఉక్కు పరరిక్షణ కోసం మార్చి 5న జరగనున్న రాష్ట్ర బంద్‌కు టీడీపీ తన మద్దతు ప్రకటించింది. తెలుగు ప్రజల ఆత్మగౌరవమైన విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఎలాంటి పోరాటానికైనా టీడీపీ సిద్దమని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మార్చి5న విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి, ట్రేడ్ యూనియన్లు నిర్వహిస్తున్న రాష్ట్ర బంద్‌కు తెలుగుదేశం పార్టీ పూర్తి మద్దతు తెలుపుతోందన్నారు.

Updated Date - 2021-03-05T02:27:12+05:30 IST