AP News: పల్నాడు జిల్లాలో చంద్రబాబు పర్యటన ఖరారు
ABN , First Publish Date - 2022-10-03T16:19:13+05:30 IST
పల్నాడు : జిల్లాలో మహానాడు నిర్వహణకు తెలుగుదేశం పార్టీ (TDP) సన్నాహాలు ప్రారంభించింది.
పల్నాడు (Palnadu): జిల్లాలో మహానాడు నిర్వహణకు తెలుగుదేశం పార్టీ (TDP) సన్నాహాలు ప్రారంభించింది. ఈ నెల 12న జరిగే మహానాడు (Mahanadu) కోసం టీడీపీ నేతలు (TDP Leaders) స్థల పరిశీలన చేశారు. మహానాడుతోపాటు మూడు రోజుల చంద్రబాబు (Chandrababu) పర్యటన విజయవంతం కోసం నేతలు కసరత్తు ప్రారంభించారు.
పల్నాడు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన ఖరారైంది. ఈ నెల 12, 13, 14 తేదీల్లో ఆయన పర్యటించనున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా తొలిరోజు మహానాడు జరగనుంది. పల్నాడు జిల్లా కేంద్రం, నరసారావుపేటలో జరగనున్న మహానాడు కోసం టీడీపీ నేతలు స్థల పరిశీలన చేశారు. టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యన్నారాయణ రాజు ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా నేతలు నరసారావుపేట పట్టణ శివారులో మూడు స్థలాలు పరిశీలించారు. మూడింటిలో రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ఓ స్థలం ఖరారు చేయనున్నారు. పల్నాడు జిల్లా ఏర్పాటైన తర్వాత తొలిసారిగా చంద్రబాబు పర్యటన నేపథ్యంలో నేతలంతా అప్రమత్తమయ్యారు. పల్నాడులో మహానాడును విజయవంతం చేయాలనే పట్టుదలతో ఉన్నారు.