Chittoor జిల్లా: రెండో రోజు Chandrababu పర్యటన

ABN , First Publish Date - 2022-07-07T18:00:56+05:30 IST

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు రెండో రోజు గురువారం పర్యటన కొనసాగుతోంది.

Chittoor జిల్లా: రెండో రోజు Chandrababu పర్యటన

చిత్తూరు (Chittoor): ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) రెండో రోజు గురువారం పర్యటన కొనసాగుతోంది. నగిరి పల్లెలో నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి (Kishore Kumar reddy) ఇంటికి వెళ్లి అల్పాహారం సేవించారు. అనంతరం కలికిరిలోని ఓ కళ్యాణ మండపంలో రాజంపేట పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహించారు. ముందుగా పీలేరు అసెంబ్లీ నియోజకవర్గ సమీక్ష ప్రారంభమైంది. ఆ తర్వాత వరుసగా రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి, తంబళ్లపల్లి, పుంగనూరు, చివరగా మదనపల్లి నియోజకవర్గం సమీక్షలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.

Updated Date - 2022-07-07T18:00:56+05:30 IST