దగ్గుబాటిని పరామర్శించిన చంద్రబాబు
ABN , First Publish Date - 2022-06-22T02:35:38+05:30 IST
Amaravathi: అనారోగ్యం కారణంగా హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దగ్గుబాటి వెంకటేశ్వర రావుని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు
అమరావతి(Amaravathi): అనారోగ్యం కారణంగా హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దగ్గుబాటి వెంకటేశ్వర రావుని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పరామర్శించారు. చికిత్స అనంతరం ఆసుపత్రిలో కోలుకుంటున్న దగ్గుబాటిని పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కాగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు టెన్నీస్ ఆడుతుండగా ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. దాంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. చికిత్స చేసిన వైద్యులు.. దగ్గుబాటి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలిపారు.