ప్రభుత్వ ఉద్యోగుల ఇన్సూరెన్స్ పాలసీల్లో మార్పులు
ABN , First Publish Date - 2021-08-17T01:12:45+05:30 IST
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఇన్సూరెన్స్ పాలసీల్లో ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది.
హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగుల ఇన్సూరెన్స్ పాలసీల్లో తెలంగాణ ప్రభుత్వం మార్పులు తీసుకొచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు విడుదల చేసింది. ప్రభుత్వం వయోపరిమితి పెంచడంతో పాలసీల్లో తగు మార్పులు చేసింది. ప్రీమియం స్లాబులు మారుస్తూ ఆర్థిక శాఖ ఆదేశాలు ఇచ్చింది. గతంలో ప్రభుత్వం 53 ఏళ్ల వరకే ఇన్సూరెన్స్కు అవకాశం కల్పించేది. కాగా ఇప్పుడు కొత్తగా 58 ఏళ్ల వరకు ఇన్సూరెన్స్ పాలసీ పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.