ఫుడ్ ఇన్స్పెక్టర్నంటూ వసూళ్లు!
ABN , First Publish Date - 2021-03-01T09:29:42+05:30 IST
ప్రభుత్వ ఉద్యోగిగా నమ్మించి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో చిరు వ్యాపారుల నుంచి డబ్బులు వసూలుచేస్తున్న వ్యక్తితో పాటు మరో ఇద్దరిని పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు పోలీసులు
ముగ్గురి అరెస్టు
కుక్కునూరు, ఫిబ్రవరి 28: ప్రభుత్వ ఉద్యోగిగా నమ్మించి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో చిరు వ్యాపారుల నుంచి డబ్బులు వసూలుచేస్తున్న వ్యక్తితో పాటు మరో ఇద్దరిని పశ్చిమగోదావరి జిల్లా కుక్కునూరు పోలీసులు అరెస్టుచేశారు. కుక్కునూరు సీఐ బాలసురే్షబాబు తెలిపిన వివరాలు.. విజయవాడకు చెందిన వజ్జల శ్రీనివా్సకుమార్ అలియాస్ వజ్జల వెంకట శ్రీనివా్సకుమార్ కొన్నేళ్లుగా రాజమండ్రిలో ఉంటూ ఫుడ్ ఇన్స్పెక్టర్గా, పొల్యూషన్ కంట్రోల్ ఆఫీసర్గా చెప్పుకుంటూ మోసాలకు పాల్పడుతున్నాడు. అతనితో పాటు అతని అసిస్టెంట్గా ఉన్న వినోద్లాల్, కార్ డ్రైవర్ చైతన్యను అరెస్టు చేసినట్టు సీఐ తెలిపారు.