చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

ABN , First Publish Date - 2021-09-18T03:55:07+05:30 IST

ప్రజలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఏడవ అదనపు జిల్లా జడ్జి రమణయ్య అన్నారు. శుక్రవారం చెన్నూరులో మండల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు.

చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
మాట్లాడుతున్న ఏడవ అదనపు జిల్లా జడ్జి రమణయ్య

గూడూరు, సెప్టెంబరు 17: ప్రజలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని ఏడవ అదనపు జిల్లా జడ్జి రమణయ్య అన్నారు. శుక్రవారం చెన్నూరులో మండల న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కేసులను త్వరితగతిన పరిష్కరించునేందుకు లోక్‌అదాలత్‌ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. గ్రామీణులకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు సదస్సులను నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు జానీబాషా, అశోక్‌కుమార్‌, న్యాయవాదులు, వివిధశాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-18T03:55:07+05:30 IST