రూ.2వేలకు చిల్లర కావాలంటూ మోసం

ABN , First Publish Date - 2021-10-27T04:34:32+05:30 IST

చిల్లర నెపంతో ఓ యువకుడు ఓ మహిళను మోసం చేశాడు. ఈసంఘటన మంగళవారం ఖమ్మం నగరంలో జరిగింది.

రూ.2వేలకు చిల్లర కావాలంటూ మోసం

ఖమ్మంక్రైం, అక్టోబరు26: చిల్లర నెపంతో ఓ యువకుడు ఓ మహిళను మోసం చేశాడు. ఈసంఘటన మంగళవారం ఖమ్మం నగరంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం నగరంలోని పార్శీబంధం ప్రాంతంలో ఓ మహిళ కిరాణాషాపు నిర్వహిస్తోంది. ఆ షాపు వద్దకు ఉదయం 11గంటల సమయంలో ఓ యువకుడు వచ్చి రూ. రెండు వేల నోటుచూపించి చిల్లరకావాలని అడిగాడు. ఆ మహిళ చిల్లర తీసి లెక్కపె డుతుండగా వాటిలో కొంత నగదు తీసుకుని ఆ యువకుడు అక్కడి నుంచి పరార య్యాడు. దీంతో ఆ మహిళ కేకలు వేయగా చుట్టుపక్కల వారు వచ్చే లోపు అతడు పరారైనట్లు స్థానికులు తెలిపారు.

Updated Date - 2021-10-27T04:34:32+05:30 IST