కరోనా పరీక్ష కేంద్రం తనిఖీ
ABN , First Publish Date - 2021-04-22T04:56:08+05:30 IST
మండల కేంద్రంలోని హనుమాన్ మందిర ఆవరణంలో ఏర్పాటు చేసిన కొవిడ్ 19 పరీక్ష కేంద్రాన్ని బుధవారం ఆసిఫాబాద్ ఆర్డీవో సిడాం దత్తు తనిఖీ చేశారు.
జైనూర్, ఏప్రిల్ 21: మండల కేంద్రంలోని హనుమాన్ మందిర ఆవరణంలో ఏర్పాటు చేసిన కొవిడ్ 19 పరీక్ష కేంద్రాన్ని బుధవారం ఆసిఫాబాద్ ఆర్డీవో సిడాం దత్తు తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పాజిటివ్ వచ్చిన వారు భయభ్రాతులకు గురికా కుండా ధైర్యంగా వైద్యం తీసుకోవాలని కోరారు. ప్రతి ఒక్క రికి కరోనా పట్ల అవగాహన కల్పించాలని, కర్ఫ్యూ యధావిధిగా ఆమలు చేయాలని అధికారులను ఆదేశించారు. మాస్కులు ధరిం చని వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా ఎంపీడీవో ప్రభు దయ, తహసీల్దార్ సాయన్న, వైద్యాధికారి నాగేంద్ర, ఈవో శంకర్, వైద్యసిబ్బంది ఉన్నారు.