విశాఖ జిల్లాలోని సినిమా థియేటర్లలో తనిఖీలు
ABN , First Publish Date - 2021-12-18T01:27:19+05:30 IST
విశాఖ జిల్లాలోని సినిమా థియేటర్లలో రెవెన్యూ అధికారులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు. ‘పుష్ప’ సినిమా విడుదల సందర్భంగా
విశాఖపట్నం: విశాఖ జిల్లాలోని సినిమా థియేటర్లలో రెవెన్యూ అధికారులు శుక్రవారం తనిఖీలు చేపట్టారు. ‘పుష్ప’ సినిమా విడుదల సందర్భంగా ప్రభుత్వం నిర్దేశించిన టికెట్ రేట్ల కంటే అధికంగా ఏమైనా విక్రయించారా?, అదనంగా షోలు ఏమైనా ప్రదర్శించారా?...అనే అంశాలపై ఆరా తీశారు. థియేటర్ల మేనేజర్ల వద్ద సమాచారం నమోదు చేసుకొని వెళ్లారు. మండల రెవెన్యూ అధికారులు వారి పరిధిలో తనిఖీలు నిర్వహించి, జాయింట్ కలెక్టర్కు నివేదికలు పంపించారు.