కనులపండువగా చెన్నయ్య శాంతి కల్యాణం

ABN , First Publish Date - 2021-11-28T03:57:21+05:30 IST

మార్కాపురంలో వెలసియున్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో శాంతి కల్యాణం శనివారం రమణీయంగా కనుల పండువుగా నిర్వ హించారు.

కనులపండువగా చెన్నయ్య  శాంతి కల్యాణం
కొలువైన చెన్నకేశవుడు


మార్కాపురం(వన్‌టౌన్‌), నవంబరు 27: మార్కాపురంలో వెలసియున్న శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో శాంతి కల్యాణం శనివారం రమణీయంగా కనుల పండువుగా నిర్వ హించారు. అర్చకులు శ్రీపతి అప్పనాచార్యులు, రంగ నాథా చార్యులు చెన్నకేశవస్వామి మూల విరాట్‌కు ప్రత్యేక అభి షేకాలు, అలంకరణ పూజలు చేశారు. అనంతరం శ్రీ దేవి భూదేవి సమేత చెన్నకేశవస్వామి ఉత్సవరులను విశేషంగా అలంకరించి శాస్త్రోక్తంగా కల్యాణ ఘట్టాలు నిర్వహించారు. ఈవో ఈదుల చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో చెన్నకేశవస్వామి క ల్యాణ సేవా సంఘం వారు భక్తులకు అన్నప్రసాదాన్ని ఏ ర్పాటు చేశారు. 

వైభవంగా వేంకటేశ్వర స్వామి ఉత్సవం 

కంభం : శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానంలో శనివారం  స్వామి వారి ఉత్సవం వైభవంగా నిర్వహించారు.  శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవేంకటేశ్వరస్వామి ఉత్సవ మూర్తులను ఆలయ ప్రాంగణంలో పల్లకిలో ఊరేగించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని పూజలు చేశారు.


Updated Date - 2021-11-28T03:57:21+05:30 IST