Amanchi krishnamohanకు మరోసారి సీబీఐ నోటీసులు
ABN , First Publish Date - 2022-06-21T17:58:56+05:30 IST
చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్కు సీబీఐ మరోసారి నోటీసులు జారీ చేసింది.
బాపట్ల: చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్(Amanchi krishnamohan)కు సీబీఐ(CBI) మరోసారి నోటీసులు జారీ చేసింది. న్యాయ వ్యవస్థపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి విచారణకు రావాలంటూ ఆమంచికి నోటీసు ఇచ్చారు. సీఆర్పీసీ సెక్షన్ 41(A) కింద నోటిసు ఇచ్చిన సీబీఐ... రేపు విచారణకు హాజరుకావాలంటూ పేర్కొంది. ఇదే అంశానికి సంబంధించి గతంలో విశాఖలో సీబీఐ ముందు ఆమంచి కృష్ణ మోహన్ హాజరైన విషయం తెలిసిందే.