‘చేనేత బంధు’ అమలు చేయాలి
ABN , First Publish Date - 2020-07-07T08:06:18+05:30 IST
‘చేనేత బంధు’ అమలు చేయాలి
హైదరాబాద్, జూలై 6 (ఆంధ్రజ్యోతి): లాక్డౌన్తో ఉపాధి కోల్పోయిన చేనేత కార్మికులను ఆదుకునేందుకు ’చేనేత బంధు’ పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ చేనేత కార్మిక సంఘం నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చేనేత కుటుంబాలకు బియ్యం, పప్పులతోపాటు నెలకు రూ.10 వేల ఆర్ధిక సాయం అందించాలని కోరారు. కార్మికులకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని 50 శాతం సబ్సిడీపై నూలు, రంగులు ఇతర సామగ్రి అందించాలని కోరారు.