పరమేశ్వరి దేవిగా చెంగాళమ్మ
ABN , First Publish Date - 2022-09-27T07:37:57+05:30 IST
సూళ్లూరుపేట చెంగాళమ్మ తొలి రోజు పరమేశ్వరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
సూళ్లూరుపేట, సెప్టెంబరు 26: సూళ్లూరుపేట చెంగాళమ్మ శరన్నవ రాత్రి వేడుకలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి.కాళంగి నదిలోని జలాలను కలశాలతో తెచ్చి పూజలతో దసరా ఉత్సవాలు ప్రారంభించారు. తొలి రోజు పరమేశ్వరి దేవి అలంకరణలో భక్తులకు చెంగాళమ్మ దర్శనమిచ్చారు.చండీయాగం నిర్వహించారు.ఆలయ చైర్మన్ బాలచంద్రరెడ్డి, మున్సిపల్ చైర్మన్ దబ్బల శ్రీమంత్ రెడ్డి, ఆలయ ఈవో ఆళ్ల శ్రీనివాసులు రెడ్డి తదితరులు కార్యక్రమాలను పర్యవేక్షించారు.చెంగాళమ్మ పుట్టినిల్లయిన గొల్లల మలువు గ్రామస్తులు అమ్మండికి మొదటి రోజు సారె సమర్పించారు.సోమవారం సాయంత్రం భక్తులు పెద్ద సంఖ్యలో తప్పెట్లు, మేళతాళాల నడుమ సారెను తీసుకుని అమ్మండి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ చైర్మన్, ఈవో సారెను అందుకుని అమ్మణ్ణికి సరమర్పించారు.టీడీపీ నాయకులు వేనం రామచంద్రారెడ్డి, వేనాటి సతీష్ రెడ్డి, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.