విమానాశ్రయంలో 990 గ్రాముల బంగారం స్వాధీనం

ABN , First Publish Date - 2022-02-13T15:48:37+05:30 IST

దుబాయ్‌ నుంచి నగరానికి వచ్చిన విమానంలో అక్రమంగా తరలించిన 990 గ్రాముల బంగారం, రూ.14.57 లక్షల విదేశీ డాలర్లను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి నలుగురు ప్రయాణికులను

విమానాశ్రయంలో 990 గ్రాముల బంగారం స్వాధీనం

ప్యారీస్‌(చెన్నై): దుబాయ్‌ నుంచి నగరానికి వచ్చిన విమానంలో అక్రమంగా తరలించిన 990 గ్రాముల బంగారం, రూ.14.57 లక్షల విదేశీ డాలర్లను స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి నలుగురు ప్రయాణికులను అరెస్ట్‌ చేసినట్లు చెన్నై కస్టమ్స్‌ అధికారులు తెలిపారు. దుబాయ్‌ విమానంలో వచ్చిన నగరానికి చెందిన మహమ్మద్‌ యాసర్‌అరాఫత్‌ (32)కు సొంతమైన బ్యాగు తనిఖీ చేసి, రూ.44.25 లక్షల విలువైన 990 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా దుబాయ్‌ వెళ్లే ప్రయాణికుల లగేజీని తనిఖీ చేయగా, ఓ బ్యాగులో రూ.14.57 లక్షల విలువగల అమెరిక డాలర్లను అక్రమంగా తరలించేందుకు యత్నించిన వైనం వెలుగుచూసింది. ఈ డాలర్లు స్వాధీనం చేసుకొని ముగ్గురిని అరెస్ట్‌ చేసి విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2022-02-13T15:48:37+05:30 IST