Chennai ఎయిర్పోర్టులో కొత్త యంత్రాలు
ABN , First Publish Date - 2022-01-09T15:20:29+05:30 IST
స్థానిక మీనంబాక్కంలోని జాతీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రయాణికులు తమ లగేజీల చెక్-ఇన్ కోసం గంటల తరబడి బారులు తీరే పద్ధతికి స్వస్తి పలికారు. కొత్త యంత్రాలు అమర్చి లగేజీ పద్ధతిని సులభతరం
- లగేజీ చెకింగ్ సులభతరం
- ప్రయాణికులకు ఉపసమనం
చెన్నై: స్థానిక మీనంబాక్కంలోని జాతీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ప్రయాణికులు తమ లగేజీల చెక్-ఇన్ కోసం గంటల తరబడి బారులు తీరే పద్ధతికి స్వస్తి పలికారు. కొత్త యంత్రాలు అమర్చి లగేజీ పద్ధతిని సులభతరం చేశారు. ఈ రెండు విమానాశ్రయాలలో చెక్-ఇన్ కౌంటర్ల వద్ద ప్రయాణికులు క్యూలైన్లలో నిలిచేవారు. ఈ పద్ధతి వల్ల ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యేవారు. ఈ పరిస్థితిని సులభతరం చేయడానికి విమానాశ్రయ అధికారులు ఎనిమిది కొత్త యంత్రాలను ఏర్పాటు చేశారు. ప్రయాణికులు ఇకపై బోర్డింగ్ పాసు తీసుకునేటప్పుడే ఈ కొత్త ఆటోమేటిక్ యంత్రాల ద్వారా నెంబర్లు కలిగిన స్టిక్కర్లు పొందాల్సి వుంటుంది. ఆ స్టిక్కర్లను ప్రయాణికులు తమ లగేజీ బ్యాగ్లు, సూట్ కేసులపై అతికించుకోవాలి. స్టిక్కర్లు అతికించిన బ్యాగ్లను ప్రయాణికులు విమానాల వద్దకే తీసుకెళ్లవచ్చు. అంతేకాకుండా ప్రయాణికులు తమ లగేజీలను వెదుక్కోవాల్సిన అవసరం ఉండదు. వాటిపై అతికించిన స్టిక్కర్లను చూసి తీసుకోగలుగుతారు. ఈ పద్ధతి వల్ల ప్రయాణికులు చెక్-ఇన్ పేరిట ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన పరిస్థితి తప్పుతుందని విమానాశ్రయ అధికారులు తెలిపారు. ఈ యంత్రాలను ఉపయోగించుకునే ప్రయాణీకుల సంఖ్యను బట్టి వాటి సంఖ్యను అధికం చేస్తామన్నారు.