-
-
Home » Prathyekam » Chennai man swallows jewels along with biryani at friends Eid party sks-MRGS-Prathyekam
-
Eid partyకి పిలిచి బిర్యానీ పెడితే రూ.1.45లక్షల బంగారు నగలు మింగేశాడు...
ABN , First Publish Date - 2022-05-06T17:19:20+05:30 IST
ఈద్ పార్టీకి పిలిచి బిర్యానీ పెడితే వచ్చిన అతిథి బిర్యానీతోపాటు రూ.1.45 లక్షల విలువ గల నగలను మింగేసిన విచిత్ర ఘటన...
చెన్నై(తమిళనాడు): ఈద్ పార్టీకి పిలిచి బిర్యానీ పెడితే వచ్చిన అతిథి బిర్యానీతోపాటు రూ.1.45 లక్షల విలువ గల నగలను మింగేసిన విచిత్ర ఘటన తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరంలో వెలుగుచూసింది. చెన్నై నగరంలోని నగల దుకాణంలో పనిచేస్తున్న host అయిన ఓ మహిళ రమజాన్ ఈద్ పండుగ సందర్భంగా తన స్నేహితురాలితోపాటు ఆమె ప్రియుడిని విందుకు ఆహ్వానించింది.విందుకు వచ్చిన స్నేహితురాలి ప్రియుడు మద్యం మత్తులో బిర్యానీతోపాటు వజ్రాల నెక్లెస్, బంగారు గొలుసు,డైమండ్ లాకెట్ లను మింగేశాడు. విందు ముగించుకుని అతిథులు వెళ్లిన తర్వాత తన ఇంట్లోని అలమారాలో వజ్రాల నెక్లెస్, బంగారు గొలుసు, డైమండ్ లాకెట్ కనిపించకుండా పోయిందని హోస్ట్ గమనించింది.
అతిథులను తనిఖీలు చేయగా.. తన స్నేహితురాలి ప్రియుడే నగలు ఎత్తుకెళ్లినట్లు అనుమానం వచ్చి ఆమె విరుగంబాక్కం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అతన్ని విచారించగా తానే బిర్యానీతోపాటు నగలను మింగేశానని అంగీకరించాడు. దీంతో పోలీసులు వైద్యుడితో నిందితుడి పొట్టను స్కానింగ్ చేయించగా ఆభరణాలు కడుపులో ఉన్నాయని తేలింది. దీంతో వైద్యులు నిందితుడికి గురువారం ఎనీమా చేసి రూ.95 వేల విలువైన బంగారు హారం, రూ.25వేల బంగారాన్ని వెలికితీసి పోలీసులకు అప్పగించారు.
నిందితుడి కడుపులో పెండెంట్ ఇంకా ఉండడిపోవడంతో దాన్ని బయటకు తీయడానికి అతనికి లాక్సిటివ్స్ ఇచ్చారు. విందు ఇచ్చిన బాధిత మహిళ కేసు నమోదు చేయడానికి ఇష్టపడక పోవడంతో పాటు ఫిర్యాదును ఉపసంహరించుకుంది. ఈద్ విందు సందర్భంగా నిందితుడు మద్యం మత్తులో బిర్యానీతో పాటు నగలను మింగినట్లు పోలీసులు చెప్పారు.