Metro రైళ్లలో 25 లక్షల మంది ప్రయాణం
ABN , First Publish Date - 2022-02-02T15:47:01+05:30 IST
గత జనవరిలో మెట్రోరైళ్లలో 25.19 లక్షల మంది ప్రయాణించినట్లు మెట్రోరైల్వే ప్రకటనలో తెలిపింది. గతేడాది జనవరి ఒకటి నుంచి డిసెంబర్ 31 వరకు 2.53 కోట్ల మంది మెట్రోరైళ్లలో ప్రయాణించారని తెలిపింది. ఈ జన
చెన్నై: గత జనవరిలో మెట్రోరైళ్లలో 25.19 లక్షల మంది ప్రయాణించినట్లు మెట్రోరైల్వే ప్రకటనలో తెలిపింది. గతేడాది జనవరి ఒకటి నుంచి డిసెంబర్ 31 వరకు 2.53 కోట్ల మంది మెట్రోరైళ్లలో ప్రయాణించారని తెలిపింది. ఈ జనవరిలో 25,19,252 మంది ప్రయాణించారని, జనవరి మూడున అధికంగా 1.35లక్షల మంది ప్రయాణించారని పేర్కొంది. కొవిడ్ నిబంధనలు పాటించడంలోనూ మెట్రో రైల్వే సంస్థ ముందంజలో ఉందని ఆ ప్రకటనలో తెలిపారు.