Chennaiలో నీల్సన్ ఐక్యూ కేంద్రం
ABN , First Publish Date - 2022-04-19T13:20:05+05:30 IST
అమెరికాకు చెందిన నీల్సన్ ఐక్యూ సంస్థ స్థానిక పోరూరు ప్రాంతంలో నెలకొల్పిన విస్తరణ కేంద్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. సచివాలయంలో సోమవారం
చెన్నై: అమెరికాకు చెందిన నీల్సన్ ఐక్యూ సంస్థ స్థానిక పోరూరు ప్రాంతంలో నెలకొల్పిన విస్తరణ కేంద్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రారంభించారు. సచివాలయంలో సోమవారం ఉదయం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో 2500 మందికి ఉపాధి కల్పించే ఈ డేటా సైన్స్ అనాలసిస్ కేంద్రానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ప్రధాన కేంద్రం కలిగిన నీల్సన్ ఐక్యూ సంస్థ సుమారు వంద దేశాల్లో శాఖలను కలిగి ఉంది. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి తంగం తెన్నరసు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు, పరిశ్రమల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ఎస్.కృష్ణన్, మార్గదర్శక సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పూజా కులకర్ణి, నీల్సన్ ఐక్యూ సంస్థ సాంకేతిక విభాగం ప్రధానాధికారి మోహిత్ కపూర్, వాణిజ్యకార్యకలాపాల విభాగం ప్రధానాధికారి మార్టిన్ రుసీలర్స్, మేనేజింగ్ డైరెక్టర్ సతీష్ పిళ్లై, చైన్నై కేంద్రం సీఈవో జేజీ ప్రియా తదితరులు పాల్గొన్నారు.