పాఠశాల బాలికలకు బోధకుడి అనుచిత సందేశాలు
ABN , First Publish Date - 2020-10-06T13:51:23+05:30 IST
చెన్నై నగరానికి చెందిన ఓ క్రైస్తవ బోధకుడు పాఠశాల బాలికలకు అనుచిత సందేశాలు పంపించిన ఘటన తాజాగా వెలుగుచూసింది....
బోధకుడి సస్పెన్షన్
వెల్లూరు (తమిళనాడు): చెన్నై నగరానికి చెందిన ఓ క్రైస్తవ బోధకుడు పాఠశాల బాలికలకు అనుచిత సందేశాలు పంపించిన ఘటన తాజాగా వెలుగుచూసింది. చెన్నై నగరానికి చెందిన సామ్ జైసుందర్ స్క్రిప్పర్ యూనియన్ ప్రచురణల విభాగం కార్యదర్శిగా, బోధకుడిగా పనిచేసేవాడు. స్క్రిప్పర్ యూనియన్ పాఠశాల విద్యార్థులకు క్రైస్తవమతం గురించి బోధించే సంస్థ. సామ్ జై సుందర్ క్రిస్టియన్ పాఠశాల బాలికలకు అనుచిత సందేశాలు పంపించారు. నిద్రపోయేటపుడు మీరు ధరించే నైటీలతో ఫొటోలు పంపించమని జై సుందర్ బాలికలను కోరాడు. సోషల్ మీడియాలో పాఠశాల బాలికలతో జై సుందర్ సంభాషించాడు.
ఈ ఘటనపై స్క్రిప్పర్ యూనియన్ బోర్డుసభ్యులు సమావేశమై జైసుందర్ ను సస్పెండ్ చేశారు.17 ఏళ్లుగా ఒకేషనల్ బైబిల్ స్కూలు ఈవెంట్ల నిర్వాహకుడై జై సుందర్ బాలికలతో అనుచిత వ్యాఖ్యలు చేశాడని దర్యాప్తులో తేలింది. దీంతో అతనిపై బోర్డు కఠినచర్యలు తీసుకుంది.