IPL 2022: మరో కీలక మ్యాచ్కు రంగం సిద్ధం.. రాజస్థాన్పై టాస్ గెలిచిన ధోనీ
ABN , First Publish Date - 2022-05-21T00:38:41+05:30 IST
ఐపీఎల్లో మరికాసేపట్లో మరో కీలక పోరు జరగనుంది. రాజస్థాన్ రాయల్స్-చెన్నై సూపర్ కింగ్స్ జట్లు తలపడనున్నాయి.
ముంబై: ఐపీఎల్లో మరికాసేపట్లో మరో కీలక పోరు జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ (RR)-చెన్నై సూపర్ కింగ్స్(CSK) జట్లు తలపడనున్నాయి. టాస్ గెలిచిన ధోనీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. చెన్నై ఇప్పటికే ప్లే ఆఫ్స్ నుంచి అవుట్ కాగా, రాజస్థాన్ జట్టు 16 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఈ మ్యాచ్లో చెన్నై ఓడినా, గెలిచినా పెద్దగా ప్రయోజనం ఉండబోదు.
రాజస్థాన్కు మాత్రం గెలుపు అత్యవసరం. విజయం సాధిస్తే నేరుగా అది ప్లే ఆఫ్స్కు చేరుకుంటుంది. ఓడినా ప్లే ఆఫ్స్కు వెళ్తుంది.. అయితే, స్థానం ఏంటన్నది మాత్రం ముంబై ఇండియన్స్ (MI)-ఢిల్లీ కేపిటల్స్(DC) మధ్య మ్యాచ్ ముగిశాక తేలుతుంది. కాబట్టి అంతవరకు తెచ్చుకోకుండా ఈ మ్యాచ్లో విజయం సాధించి రెండో స్థానానికి ఎగబాకాలని చూస్తోంది. 2018 నుంచి ఇరు జట్లు 25 సార్లు తలపడగా చెన్నై 15 గేముల్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్లోనూ విజయం సాధించి ఆధిక్యం ప్రదర్శిస్తుందా? లేదా? అన్ని చూడాల్సిందే.