IPL 2022: పంజాబ్పై టాస్ గెలిచిన చెన్నై
ABN , First Publish Date - 2022-04-04T00:42:43+05:30 IST
ఐపీఎల్లో భాగంగా మరికాసేపట్లో పంజాబ్ కింగ్స్తో జరగనున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి
ముంబై: ఐపీఎల్లో భాగంగా మరికాసేపట్లో పంజాబ్ కింగ్స్తో జరగనున్న మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ గెలిచి ప్రత్యర్థిని బ్యాటింగ్కు ఆహ్వానించింది. ఇప్పటి వరకు పంజాబ్ రెండు మ్యాచ్లు ఆడి ఓ మ్యాచ్లో గెలిచి మరో దాంట్లో ఓడింది. చెన్నై మాత్రం ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడి ఇంకా ఖాతా తెరవలేదు. భారీ స్కోర్లు చేస్తున్న ఆ జట్టుకు కలిసి రావడం లేదు. ఈ మ్యాచ్లోనైనా గెలిచి ఖాతా తెరవాలని భావిస్తోంది.
పంజాబ్ జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. హర్ప్రీత్ బ్రార్ స్థానంలో వైభవ్ జట్టులోకి రాగా, రాజ్ బవా స్థానంలో జితేశ్ తుది జట్టులోకి వచ్చాడు. వరుస ఓటములతో తీవ్ర ఒత్తిడిలో ఉన్న జడేజా సేన ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. తుషార్ స్థానంలో క్రిస్ జోర్డాన్కు జట్టులో చోటు కల్పించింది.