Airplanes: చెన్నై నుంచి అదనపు విమాన సర్వీసులు
ABN , First Publish Date - 2022-09-06T12:55:11+05:30 IST
చెన్నై విమానాశ్రయం(Chennai Airport) నుంచి రాకపోకలు సాగించే ప్రయాణీకుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. దీంతో చెన్నై నుంచి పలు ప్రాంతాలకు
- పెరిగిన డొమెస్టిక్ ప్రయాణికుల సంఖ్య
అడయార్(చెన్నై), సెప్టెంబరు 5: చెన్నై విమానాశ్రయం(Chennai Airport) నుంచి రాకపోకలు సాగించే ప్రయాణీకుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. దీంతో చెన్నై నుంచి పలు ప్రాంతాలకు విమానాల సంఖ్య పెంచారు. ముఖ్యంగా ఈ నెల ప్రారంభం నుంచి ముంబై, బెంగుళూరు, కొచ్చిన్, మైసూర్, హైదరాబాద్, ఢిల్లీ(Mumbai, Bangalore, Cochin, Mysore, Hyderabad, Delhi) తదితర నగరాలకు విమాన సర్వీసులు గణనీయంగా పెరిగాయి. కరోనా మహమ్మారి తర్వాత ఒక్కసారిగా విమానాల సంఖ్య పెంచడంతో ప్రయాణికులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు చెన్నై నుంచి ముంబైకు నడిపే విమానాల సంఖ్య రెండువైపులా కలిపి 38గా ఉండగా, ఇకపై వీటి సంఖ్యను 40కు పెంచారు. అలాగే, ఈ నెల 26న చెన్నై నుంచి ఆకాశ్ ఎయిర్లైన్స్ కూడా తన సర్వీసులను నడుపనుంది. చెన్నై - మైసూర్(Chennai - Mysore) మధ్య కూడా ప్రయాణికుల సంఖ్య పెరగడంతో ఈ మార్గంలో అలయన్స్ ఎయిర్ విమానాలను వారంలో మూడు రోజుల పాటు ఆది, బుధ, శుక్రవారాల్లో విమాన సర్వీసులను నడుపనుంది. ఇదేవిధంగా దేశంలోని మరికొన్ని ప్రధాన నగరాలకు ఈ విమాన సర్వీసులను నడుపనున్నారు. మరోవైపు, విమాన సర్వీసులను పెంచడంతో చెన్నై విమానాశ్రయం మీదుగా రాకపోకలు సాగించే ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.