యువకుల గస్తీ..
ABN , First Publish Date - 2021-07-26T06:50:14+05:30 IST
శివారు ప్రాంతాల్లో చోరీలు పెరిగిపోతున్న నేపథ్యంలో చర్లపల్లి డివిజన్
కుషాయిగూడ, జూలై 25 (ఆంధ్రజ్యోతి): శివారు ప్రాంతాల్లో చోరీలు పెరిగిపోతున్న నేపథ్యంలో చర్లపల్లి డివిజన్ విద్యామారుతీనగర్ కాలనీవాసులు రాత్రిపూట స్వచ్ఛందంగా గస్తీ నిర్వహిస్తున్నారు. అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు నర్సిరెడ్డి, ప్రసాద్ పర్యవేక్షణలో యువకులు పోలీసుల బందోబస్తుకు అదనంగా వంతుల వారీగా కాలనీలలో తిరుగుతూ ‘పారాహుషార్’ చెబుతున్నారు. కాగా, పక్కనే ఉన్న నాగారం పరిసరాలలో చెడ్డీ గ్యాంగ్ సంచరిస్తోందన్న సమాచారం మేరకు ముందస్తు జాగ్రత్తగా తాము కాపలా కాస్తున్నట్లు కాలనీ సంక్షేమ సంఘం నాయకులు తెలిపారు.