చెరువులను తలపిస్తున్న వరి పొలాలు

ABN , First Publish Date - 2021-11-27T06:34:02+05:30 IST

చెరువులను తలపిస్తున్న వరి పొలాలు

చెరువులను తలపిస్తున్న వరి పొలాలు
వీరవల్లిలో నీటిలో మునిగిపోయిన వరి

కడవకొల్లు(ఉయ్యూరు), నవంబరు 26 : ఉయ్యూరు  మండలం కడవకొల్లు గ్రామ పంచాయతీ  వీరవల్లి గ్రామ పరిధిలో వరిపొలాల్లో నీరు నిలిచి చెరువుల్లా కన్పిస్తున్నాయి. పురుగుల డొంక ప్రాంతంలో మురుగు కాల్వ పూడుకుపోయి పొలాల్లో నీరు పోయే మార ్గంలేక మోకాలు లోతు నీళ్లు నిలిచి వరి పంట నీటిలో మునిగి కంకులనుంచి మొలకలు వస్తున్న పరిస్థితుల్లో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు పొలాల్లో వరిపంట నేల వాలగా పల్లపు ప్రాంతాల్లో నీరు పోయేందుకు మార్గంలేక నిలిచిపోయింది. మురుగు కాల్వచెత్త పెరిగి,  పక్కన ఉన్న చెట్లకొమ్మలు విరిగి పడిపోగా నీరు పోవడం లేదని, కాల్వ బాగు చేయించాలని అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించు కున్న వారు లేరని వాపోతున్నారు. నీటిలో నానుతున్న వరి కుళ్లి కోత కోసేందుకు కూడా పనికి రాకుండా పోతుందని,  నీటిలో నాని కంకులనుంచి మొలకలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని రోజులు నీరు నిలిచి ఉంటే పంట కోయకుండా దమ్ము చేయవలసి వస్తుందని ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2021-11-27T06:34:02+05:30 IST