జేఈఈ ఫలితాల్లో చేతన్‌ ప్రతిభ

ABN , First Publish Date - 2021-10-17T06:45:41+05:30 IST

జేఈఈ అడ్వాన్స్‌ -2021 ఫలితాల్లో పీలేరుకు చెందిన పోతంశెట్టి చేతన్‌మనోజ్ఞసాయి జాతీయ స్థాయి ఓపెన్‌కేటగిరిలో 92వ ర్యాంకు సాధించి ప్రతిభచూపాడు.

జేఈఈ  ఫలితాల్లో చేతన్‌ ప్రతిభ
చేతన్‌మనోజ్ఞసాయికి మిఠాయి తినిపిస్తున్న తల్లిదండ్రులు పోతంశెట్టి లావణ్య, రమేష్‌

 జాతీయ స్థాయిలో 92వ ర్యాంకు 

పీలేరు, అక్టోబరు 16: జేఈఈ అడ్వాన్స్‌ -2021 ఫలితాల్లో పీలేరుకు చెందిన పోతంశెట్టి చేతన్‌మనోజ్ఞసాయి జాతీయ స్థాయి ఓపెన్‌కేటగిరిలో 92వ ర్యాంకు సాధించి ప్రతిభచూపాడు. చేతన్‌మనోజ్ఞసాయికి అతడి తల్లిదండ్రులైన  పీలేరు జడ్పీ మెయిన్‌ ఉన్నత పాఠశాల గణిత శాస్త్ర ఉపాఽధ్యాయుడు పోతంశెట్టి రమేష్‌, లావణ్య మిఠాయిలు తినిపించారు. సంతోషం వ్యక్తం చేశారు. విజయవాడ శ్రీచైతన్య విద్యాసంస్థలలో ఎనిమిదో తరగతి నుంచి చదవడం, ఉపాధ్యాయుల, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ ర్యాంకు సాధించానని చేతన్‌మనోజ్ఞసాయి తెలియజేశాడు. 

Updated Date - 2021-10-17T06:45:41+05:30 IST