చేవెళ్ల వ్యవసాయ మార్కెట్‌ నూతన పాలకవర్గం

ABN , First Publish Date - 2022-10-02T04:52:08+05:30 IST

చేవెళ్ల వ్యవసాయ మార్కెట్‌ నూతన పాలకవర్గం

చేవెళ్ల వ్యవసాయ మార్కెట్‌ నూతన పాలకవర్గం
మంత్రి సబితారెడ్డికి పుష్పగుచ్ఛం అందజేస్తున్న చేవెళ్ల మార్కెట్‌ పాలకవర్గం

చేవెళ్ల, అక్టోబరు 1: చేవెళ్ల వ్యవసాయ మార్కెట్‌ యార్డు నూతన పాలకవర్గం చైర్మన్‌, కమిటీ సభ్యుల నియామకం పూర్తయింది. ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి గెజిట్‌ విడుదల చేశారు. శనివారం నూతన పాలకవర్గం చైర్మన్‌, సభ్యులు మంత్రి సబితారెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్యలను కలిశారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గాన్ని వారు అభినందించారు. చేవెళ్ల వ్యవసాయ మర్కెట్‌ కమిటీ నూతన చైర్మన్‌గా మిట్ట వెంకట్‌రంగారెడ్డి, వైఎస్‌ చైర్మన్‌గా బి.నర్సింలు, కమిటీ సభ్యులుగా బుర్ల సుమలత, వై.కృష్ణ, బుర్ల మహేశ్‌, తెలుగు వెంకటేశ్‌, ఎండి.ఫయాజూద్దిన్‌, తిరుపతిరెడ్డి, గోనే కరుణాకర్‌రెడ్డి, కృష్ణనాయక్‌, శ్రీనివా్‌సగౌడ్‌, ఆర్‌.వెంకటేశ్‌, కుంచం సతీ్‌షకుమార్‌, ఎం.చంద్రశేఖర్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మాలతికృష్ణారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు ప్రభాకర్‌, నాయకుడు చింటు పాల్గొన్నారు.  

Updated Date - 2022-10-02T04:52:08+05:30 IST