అటవీ భూముల పంపకంలో ఛత్తీ్సగఢ్ టాప్
ABN , First Publish Date - 2020-08-09T09:11:25+05:30 IST
అటవీ భూముల పంపకాల్లో ఛత్తీ్సగఢ్.. దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఈ రాష్ట్రం 4.84 లక్షల మంది గిరిజనులు, ఇత ర అటవీ నివాసితులకు 50.16 లక్షల ఎకరాల అటవీ
రాయ్పూర్, ఆగస్టు 8: అటవీ భూముల పంపకాల్లో ఛత్తీ్సగఢ్.. దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటివరకు ఈ రాష్ట్రం 4.84 లక్షల మంది గిరిజనులు, ఇత ర అటవీ నివాసితులకు 50.16 లక్షల ఎకరాల అటవీ భూమి పట్టాలు పంపిణీ చేసింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రజా సంబంధాల విభాగం శనివారం వెల్లడించింది. ఒడిశా 4.43 లక్షల మంది గిరిజనులకు పట్టాలు పంపిణీ చేసి రెండో స్థానంలో నిలవగా.. మధ్యప్రదేశ్, మహారాష్ట్రలు మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి.