సాహితీ దిగ్గజానికి నివాళి

ABN , First Publish Date - 2021-02-26T18:22:58+05:30 IST

ప్రముఖ రచయిత సింగమనేని నారాయణ రావు మృతి పట్ల చికాగో సాహితీ వేదిక సంతాపం తెలియజేసింది.

సాహితీ దిగ్గజానికి నివాళి

ప్రముఖ రచయిత సింగమనేని నారాయణ రావు మృతి పట్ల చికాగో సాహితీ వేదిక సంతాపం తెలియజేసింది. ఈ సందర్భంగా సాహితీ వేదిక ఆయనను ప్రత్యేకంగా స్మరిస్తూ ... సాహితీ దిగ్గజం, రాయలసీమ గుండెచప్పుడు వినిపించిన విలక్షణ మానవతావాది ప్రజారచయిత సింగమనేని నారాయణ మరణం తెలుగు సాహితీ లోకానికి తీరనిలోటు. కరువుకు ఆలవాలమైన రాయలసీమ దుస్థితిని మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లా దయనీయస్థితిని తన రచనలు, ప్రజాకార్యక్రమాల ద్వారా ఏ రాజకీయనాకునికి లేదా పార్టీకి తీసిపోని విధంగా ప్రజల దృష్టికి తెచ్చారు. సింగమనేని నారాయణ మరణం పట్ల సంతాపం తెలియజేస్తున్నాం. సింగమనేని నారాయణ తన అనేక రచనల్లో గుండెలను పిండేలాగా చిత్రించిన కరువు సీమ రైతుల బాధలను నివారించడానికి నిర్మాణాత్మకమైన పనులను చేపట్టడమే ప్రభుత్వం ఆయనకు అర్పించే నిజమైన నివాళి. ఆయన ఆశయాలను, స్ఫూర్తిని అందుకుని రచయితలు, సామాజిక కార్యకర్తలు పని చేయడమే ఆయనకు అంజలి ఘటించడం అవుతుంది.

చికాగో సాహితీ మిత్రుల తరపున

మెట్టుపల్లె జయదేవ రెడ్డి

సెక్రటరీ

Updated Date - 2021-02-26T18:22:58+05:30 IST