చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ దుబాయి పర్యటన! భారీ ఏర్పాట్లు చేస్తున్న ఎన్నారైలు!

ABN , First Publish Date - 2022-03-17T00:55:51+05:30 IST

మోదటిసారిగా దుబాయి పర్యటనకు వస్తున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి యన్.వి.రమణకు స్వాగతం పలికెందుకు యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ లోని ప్రవాసీయులందరు సంసిద్ధమవుతున్నారు.

చీఫ్ జస్టిస్ ఎన్‌వీ రమణ దుబాయి పర్యటన! భారీ ఏర్పాట్లు చేస్తున్న ఎన్నారైలు!

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: మోదటిసారిగా దుబాయి పర్యటనకు వస్తున్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి యన్.వి.రమణకు స్వాగతం పలికెందుకు యునైటెడ్ అరబ్ ఏమిరేట్స్ లోని ప్రవాసీయులందరు సంసిద్ధమవుతున్నారు. ఒక అంతర్జాతీయ సదస్సును ఉద్దెశించి ప్రసంగించడానికి జస్టిస్ రమణ బుధవారం రానున్నారు. ఈ సందర్భంగా ఆయన్ను ఘనంగా సన్మానించడానికి ఆబుధాబిలోని ప్రవాసీయులందరు చురుక్కుగా ఏర్పాట్లు చేస్తున్నారు. 


ఈ మెరకు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఆబుధాబిలోని ఇండియన్ సోషల్ కల్చరల్ సెంటర్‌లో జస్టిస్ రమణకు ప్రవాసీయులు స్వాగత కార్యక్రమం ఏర్పాటు చేసి విందు ఇస్తున్నారు. ఔత్సిహిక ప్రవాసీయులు దుబాయిలో గుండిమేడ దినూతో 00971582842776 సంప్రందించవచ్చు. రెండు రోజుల పాటు దుబాయి, ఆబుధాబిలలో పర్యటించనున్న చీఫ్ జస్టిస్ రమణ..  హైదరాబాద్‌లో ఇటీవల నెలకోల్పిన అంతర్జాతీయ వాణిజ్య వివాదాల పరిష్కార మండలి ఆవశ్యకత, ప్రాధాన్యత గురించి వివరిస్తారు. జస్టిస్ రమణతో పాటు సుప్రీం కోర్టు న్యాయమూర్తులు డి.వై.చంద్రచూడ్, యల్. నాగేశ్వర రావు, హిమా కోహ్లీ, భారత రాయబారి సంజయ్ సుధీర్‌లు ప్రసంగిస్తారు.

Updated Date - 2022-03-17T00:55:51+05:30 IST