Chief Minister MK Stalin: దేవాదాయ శాఖలో ఈవోల నియామకం
ABN , First Publish Date - 2022-09-18T14:08:40+05:30 IST
దేవాదాయశాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలకు టీఎన్పీఎస్సీ పరీక్షల ద్వారా ఎంపికైన 22 మందికి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister
చెన్నై, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): దేవాదాయశాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉద్యోగాలకు టీఎన్పీఎస్సీ పరీక్షల ద్వారా ఎంపికైన 22 మందికి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(Chief Minister MK Stalin) శనివారం నియామకపు ఉత్తర్వులు అందజేశారు. సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో కొత్త ఈవోలు సీఎం చేతుల మీదుగా ఉత్తర్వులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు, పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పి. చంద్రమోహన్, దేవాదాయ శాఖ కమిషనర్ జే కుమారగురుబరన్, అదనపు కమిషనర్ ఇరా కన్నన్ తదితరులు పాల్గొన్నారు.