పేదల ఆకలి తెలిసిన ముఖ్యమంత్రి

ABN , First Publish Date - 2020-07-06T10:44:49+05:30 IST

పేదల ఆకలి తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు

పేదల ఆకలి తెలిసిన ముఖ్యమంత్రి

రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌


కరీంనగర్‌ రూరల్‌, జులై 5: పేదల ఆకలి తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ఆదివారం చర్లబూత్కూర్‌ గ్రామంలో ఉచితరేషన్‌బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కరోనా నేపథ్యంలో ఎవరూ ఆకలితో అలమటించకుండా ఉండేందుకు తెల్ల రేషన్‌ కార్డుదారులందరికీ పదికిలోలు ఉచితంగా బియ్యాన్ని ఐదు నెలల పాటు అందిస్తామన్నారు. దీనివల్ల రాష్ట్ర ఖజానాపై 266కోట్ల అదనపు భార పడుతుందన్నారు. కేంద్రం కోటి 91లక్షల మందికి మాత్రమే బియ్యం సరఫరా చేస్తే, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా మరో 88 లక్షల మందిని కలిపి 2కోట్ల 80లక్షల మందికి బియ్యం అందిస్తోందన్నారు. మొత్తం 2.80కోట్ల మందికి లబ్ధిచేకూరనుందన్నారు. అనంతరం హరితాహారంలో భాగంగా గ్రామంలో మొక్కలు నాటారు.

Updated Date - 2020-07-06T10:44:49+05:30 IST