చెరువులో పడి ముగ్గురు బాలురు మృతి

ABN , First Publish Date - 2020-11-30T02:22:07+05:30 IST

రామసముద్రం మండలం గుంతలవారిపల్లెలో విషాదం చోటు చేసుకుంది. దిన్నె చెరువులో పడి ముగ్గురు బాలురు మృతి చెందారు. మృతులు వినయ్(15), యశ్వంత్(13), నాగభూషణం(15)గా...

చెరువులో పడి ముగ్గురు బాలురు మృతి

చిత్తూరు: రామసముద్రం మండలం గుంతలవారిపల్లెలో విషాదం చోటు చేసుకుంది. దిన్నె చెరువులో పడి ముగ్గురు బాలురు మృతి చెందారు. మృతులు వినయ్(15), యశ్వంత్(13), నాగభూషణం(15)గా గుర్తించారు. చెరువులో స్నానం చేసేందుకు వెళ్లిన ముగ్గురు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. స్థానికులు రక్షించే ప్రయత్నం చేసినా ముగ్గురు బాలురు చనిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న పిల్లలు ఇక లేరని తెలిసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. 

Updated Date - 2020-11-30T02:22:07+05:30 IST