అశ్లీల వీడియోలు చూడ్డానికి అలవాటు పడ్డ పిల్లలు.. ఓ రోజు బాలికతో ఆ పని చేయించాలని పట్టుబట్టారు.. చివరకు జరిగింది ఇదీ..!

ABN , First Publish Date - 2021-10-23T03:27:11+05:30 IST

అస్సాంలోని గవావ్ జిల్లా ఎస్పీ ఆనంద్ మిశ్రా కథనం మేరకు.. కలియబర్ పట్టణ పరిధిలో ముగ్గురు బాలలు అశ్లీల వీడియోలకు అడిక్ట్ అయ్యారు. వారి తల్లిదండ్రులతో ఆన్‌లైన్ తరగతుల కోసమని తీసుకుని.. అశ్లీల వీడియోలు చూసేవారు. ఈ క్రమంలో

అశ్లీల వీడియోలు చూడ్డానికి అలవాటు పడ్డ పిల్లలు.. ఓ రోజు బాలికతో ఆ పని చేయించాలని పట్టుబట్టారు.. చివరకు జరిగింది ఇదీ..!

స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక.. ప్రపంచం చాలా చిన్నదైపోయింది. అయితే దీనివల్ల మంచి ఎంత ఉందో.. చెడు కూడా అంతే ఉంది. ఉపయోగించున్న వారికి సోషల్ మీడియాలో ఎంతో సమాచారం అందుతుంది. దుర్వినియోగం చేసుకుంటే.. ఆఖరికి జీవితాలే సర్వనాశనమవుతాయి. అస్సాంలో 8నుంచి 11 ఏళ్ల వయసున్న ముగ్గురు పిల్లలు స్మార్ట్ ఫోన్లలో అశ్లీల వీడియోలను చూడ్డానికి అలవాటు పడ్డారు. వారు చూసింది చాలక.. చివరికి ఎంతపని చేశారో తెలుసా.. వివరాల్లోకి వెళితే..


అస్సాంలోని గవావ్ జిల్లా ఎస్పీ ఆనంద్ మిశ్రా కథనం మేరకు.. కలియబర్ పట్టణ పరిధిలో ముగ్గురు బాలలు అశ్లీల వీడియోలకు అడిక్ట్ అయ్యారు. వారి తల్లిదండ్రులతో ఆన్‌లైన్ తరగతుల కోసమని ఫోన్లు తీసుకుని.. అశ్లీల వీడియోలు చూసేవారు. ఈ క్రమంలో మంగళవారం ఓ బాలికను ఊరి బయటకు తీసుకెళ్లారు. తమతో పాటూ అశ్లీల వీడియోలను చూపించేందుకు ప్రయత్నించారు. అయితే అందుకు బాలిక నిరాకరించింది.


దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బాలలు.. ఆమెను రాళ్లతో కొట్టి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని సమీపంలోని మరుగుదొడ్డిలో పడేశారు. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టగా విషయం బయటపడింది. నేరాన్ని దాచారనే కారణంతో నిందితుల్లో ఒకరి తండ్రిని కూడా అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. పిల్లల ఫోన్లను తరచూ తనిఖీ చేస్తుండాలని పోలీసులు సూచిస్తున్నారు.

Updated Date - 2021-10-23T03:27:11+05:30 IST