కన్నతండ్రే.. కసాయిలా..

ABN , First Publish Date - 2022-09-21T05:58:51+05:30 IST

కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని సీతారామపురానికి చెందిన మురారి వెంక టేశ్వర్లు అలియాస్‌ వెంకటేశ్వరరావుకు పెదకాకానికి చెందిన జ్యోతి అనే యువతితో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది.

కన్నతండ్రే.. కసాయిలా..
మృతిచెందిన చిన్నారులు జోత్న్స, షణ్ముక వర్మ

పిల్లలిద్దరినీ బకింగ్‌ హామ్‌  కెనాల్‌లో పడేసి చంపిన తండ్రి

భార్యతో తరచూ గొడవలు..

బావమరిది తనపై చేయిచేసుకున్నాడని అక్కసు..

చివరికి పసివాళ్ల ఉసురు తీసిన వైనం 


పెదకాకాని, సెప్టెంబరు 20: కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని సీతారామపురానికి చెందిన మురారి వెంక టేశ్వర్లు అలియాస్‌ వెంకటేశ్వరరావుకు పెదకాకానికి చెందిన జ్యోతి అనే యువతితో ఏడేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి జ్యోత్న్స(6), షణ్ముక వర్మ(4) కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆర్థిక కారణాలతో రెండేళ్ల కిం దట పెదకాకానికి వలస వచ్చి  నివాసం ఉంటు న్నారు. భార్యాభర్తలు కూలీ పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నా రు. వెంకటేశ్వరరావు తరు చూ భార్యతో గొడవ పడుతుండేవాడు. పదిరోజుల క్రితం భార్యను విచక్షణా రహితంగా కొట్టగా ఆమె పెదకాకాని పో లీసులకు ఫిర్యాదు చేసింది. పోలీస్‌స్టేషన్‌లో కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపినా వెంకటేశ్వరరావులో ఎలాంటి మార్పు రాలేదు. నాలుగు రోజుల క్రితం తిరిగి భార్యను కొ ట్టాడు. విషయం తెలుసుకున్న బామ్మర్ధి తన చెల్లిని కొట్టా డన్న అక్కసుతో వెంకటేశ్వరావుపై చేయి చేసుకున్నా డు. దీంతో బావ బావమరుదులు ఘర్షణ పడ్డారు. పిల్లలిద్దరూ అత్త సీతారావమ్మ వద్ద ఉంటున్నారు. వారిని పంపాలని వెంకటేశ్వరరావు కోరగా అత్త నిరాకరించింది. దీంతో తన పిల్లలు తన వద్దకు రావటం లేదని, బావమరిది కొట్టాడని, మనసులో పెట్టుకొని జ్యోత్స్న, షణ్ముకవర్మలను చంపేం దుకు తండ్రి పథకంరూపొందించాడు. సోమవారం సా యంత్రం అత్త ఇంటికి వెళ్లి పిల్లలిద్దరినీ బైక్‌పై ఎక్కిం చుకుని తీసుకు వెళ్లాడు. తాడేపల్లి సమీపంలోని బకింగ్‌హాం కెనాల్‌ వద్దకు వెళ్లి తొలుత షణ్ముకవర్మను గొంతుపిసికి నీటిలో ముంచాడు. ఆ తరువాత జ్యోత్స్న ను కూడా నీటిలోకి లాక్కెళ్లి చంపేశాడు. తిరిగి ఇంటి వచ్చి ఏమీ ఎరగనట్టు నటించాడు. పిల్లలు ఎక్కడ ఉన్నారని తల్లి అడగ్గా తనకు తెలియదని చెప్పా డు. పిల్లలు ఇద్దరు అదృశ్యం అయినట్లుగా జ్యోతి సోమవా రం రాత్రి పెదకాకాని స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసింది. ఈ లోగా వెంకటేశ్వరరావే పిల్లలి ద్దరినీ తీసుకు వెళ్లాడని స్థాని కులు చెప్పారు. అతనిని పోలీ సులు అదుపులోకి తీసు కొని విచారించగా తన పిల్లలను తానే చంపినట్లుగా ఒప్పు కొన్నాడు. దీంతో పెదకాకాని పోలీసులు వెంకటేశ్వరరావును వెంటపెట్టుకొని ఘటనా స్థలా నికి వెళ్లి గజఈత గాళ్లతో వెతికించారు. కాలువలో చిన్నారుల మృతదేహా లు లభ్యమయ్యాయి. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను తర లిం చారు. నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు. చిన్నారులు మృతి చెందడంతో తల్లి, అమమ్మ, బంధు వులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 




Updated Date - 2022-09-21T05:58:51+05:30 IST