చిలుకూరులో నిరాడంబరంగా ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు

ABN , First Publish Date - 2021-04-23T04:30:04+05:30 IST

హైదరాబాద్: కరోనా మహమ్మారి నేపథ్యంలో చిలుకూరులో వార్షిక బ్రహ్మోత్సవాలు నేడు ధ్వజారోహణంతో నిరాడంబరంగా ప్రారంభమయ్యాయి.

చిలుకూరులో నిరాడంబరంగా ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు

హైదరాబాద్: చిలుకూరులో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. కరోనా మహమ్మారి నేపథ్యంలో బ్రహ్మోత్సవాలను నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు. తొలుతగా గరుత్మంతుల వారిని అలంకరించారు. ఆ తర్వాత యాగశాలలో హోమాలు నిర్వహించారు. అనంతరం గరుడమూర్తికి అభిషేకం చేశారు. అనంతరము మంగళ హారతి చేసి గరుడ ముద్దను నైవేద్యం చేసి ఆ ప్రసాదాన్ని సంతానం లేని ఆడవాళ్ళకు సంతానప్రాప్తి కోసం వితరణ చేశారు. 

Updated Date - 2021-04-23T04:30:04+05:30 IST