చల్లబడిన నగరం
ABN , First Publish Date - 2021-04-24T05:10:00+05:30 IST
క్యుములోనింబస్ మేఘాలతో శుక్రవారం నగరం చల్లబడింది.
విశాఖపట్నం, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): క్యుములోనింబస్ మేఘాలతో శుక్రవారం నగరం చల్లబడింది. ఉదయం నుంచి ఎండ తీవ్రత, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. అయితే మధ్యాహ్నం నుంచి ఒక్కసారిగా వాయువ్య దిశ నుంచి మేఘాలు ఆవరించి తరువాత గాలులు ప్రారంభమయ్యాయి. నగర శివారు ప్రాంతంలో వర్షం కురిసింది. నగరంలో అక్కడక్కడా చిరు జల్లులు కురిశాయి.