భారత్ డిమాండ్లకు తలొగ్గిన డ్రాగన్ !
ABN , First Publish Date - 2020-09-23T12:08:35+05:30 IST
భారత్-చైనాల మధ్య కమాండర్ స్థాయి అధికారుల మధ్య ఆరోసారి జరిగిన చర్చలు డ్రాగన్లో కొంత మేర సానుకూల కదలికలను తీసుకువచ్చాయి.
న్యూఢిల్లీ, సెప్టెంబరు 22: భారత్-చైనాల మధ్య కమాండర్ స్థాయి అధికారుల మధ్య ఆరోసారి జరిగిన చర్చలు డ్రాగన్లో కొంత మేర సానుకూల కదలికలను తీసుకువచ్చాయి. మోల్దో వద్ద జరిగిన చర్చల్లో భారత్ చేసిన డిమాండ్లలో కొన్నింటిని చైనా అంగీకరించింది.
వచ్చే నెల నుంచి లద్దాఖ్ ప్రాంతంలో చలి -25 డిగ్రీల్లో ఉండనున్న నేపథ్యంలో.. వీలైనంత త్వరలో చర్చలు సఫలమయ్యేలా చూడాలని డ్రాగన్ను కోరింది. ప్రధానంగా.. ఎల్ఏసీకి ఇవతల.. దెప్సాంగ్, పాంగాంగ్ ఫింగర్స్ ప్రాంతాల నుంచి చైనా సైన్యం వెనక్కి తగ్గాలని భారత అధికారులు డిమాండ్ చేశారు.
కాగా మూడేళ్ల కాలంలో డోక్లాం సమీపంలో చైనా మరిన్ని సైనిక వనరులను సమకూర్చుకుందని అంతర్జాతీయ భద్రత కన్సల్టెన్సీ ‘స్ర్టాట్ఫర్’ నివేదిక వెల్లడించింది.