భారత్‌పై చైనా సైబర్ దాడి.. రిపోర్టులపై డ్రాగన్ కంట్రీ విమర్శలు!

ABN , First Publish Date - 2021-03-02T05:39:33+05:30 IST

ముంబై మహానగరంలో గతేడాది జరిగిన పవర్ ఔటేజి చైనా సైబర్ దాడేనని వచ్చిన రిపోర్టులపై డ్రాగన్ కంట్రీ మండిపడింది. అమెరికాకు చెందిన ఓ కంపెనీ ఇచ్చిన ఈ నివేదికను చైనా విదేశాంగ శాఖ తప్పుబట్టింది.

భారత్‌పై చైనా సైబర్ దాడి.. రిపోర్టులపై డ్రాగన్ కంట్రీ విమర్శలు!

బీజింగ్: ముంబై మహానగరంలో గతేడాది జరిగిన పవర్ ఔటేజి చైనా సైబర్ దాడేనని వచ్చిన రిపోర్టులపై డ్రాగన్ కంట్రీ మండిపడింది. అమెరికాకు చెందిన ఓ కంపెనీ ఇచ్చిన ఈ నివేదికను చైనా విదేశాంగ శాఖ తప్పుబట్టింది. సరిహద్దుల్లో భారత్, చైనా దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలోనే డ్రాగన్ కంట్రీ ఇండియాపై సైబర్ దాడి చేసిందని ఈ నివేదిక పేర్కొంది. భారత్‌లోని పవర్ గ్రిడ్లపై చైనా ఈ ఎటాక్ చేసినట్లు తెలిపింది. వీటిపై స్పందించిన చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి.. ఈ నివేదికలను పూర్తి బాధ్యతారాహిత్యంగా అభివర్థఇంచారు. ‘‘సైబర్ దాడులపై చైనా వైఖరి స్పష్టంగా ఉంది. ఇలాంటి దాడులకు మేము పూర్తిగా వ్యతిరేకం. ఈ విషయంలో ఎటువంటి ఊహాగానాలకూ తావు లేదు’’ అని చైనా విదేశాంగ శాఖ స్పష్టంచేసింది.

Updated Date - 2021-03-02T05:39:33+05:30 IST