భారత్కు సాయానికి సిద్ధం!
ABN , First Publish Date - 2021-04-23T08:11:32+05:30 IST
కరోనా కట్టడి విషయంలో భారత్కు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చైనా ప్రకటించింది. ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ గు రువారం మీడియాతో మాట్లాడుతూ..
- కరోనాపై ఉమ్మడిగా పోరాడదాం: చైనా
బీజింగ్, ఏప్రిల్ 22: కరోనా కట్టడి విషయంలో భారత్కు సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చైనా ప్రకటించింది. ఆ దేశ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ గు రువారం మీడియాతో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందని, దీంతో.. అక్కడ తాత్కాలికంగా మందులు, ఇతర వైద్య సామగ్రి కొరత ఏర్పడిందని అన్నారు. ఈ స్థితిలో కరోనా కట్టడికి సహకరించేందుకు, అవసరమైన వైద్య సామగ్రిని సరఫరా చేసేందుకు చైనా సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.