China Visa: భారతీయులకు చైనా గుడ్ న్యూస్!

ABN , First Publish Date - 2022-08-23T05:08:23+05:30 IST

ఎన్నారై డెస్క్: భారతీయ విద్యార్థులకు మళ్లీ వీసాల జారీని త్వరలో ప్రారంభిస్తామని చైనా ప్రభుత్వం తాజాగా ప్రకటించింది.

China Visa: భారతీయులకు చైనా గుడ్ న్యూస్!

ఎన్నారై డెస్క్: భారతీయ విద్యార్థులకు మళ్లీ వీసాల(Visa) జారీని త్వరలో ప్రారంభిస్తామని చైనా(China) ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. చైనాలో చదువుకుంటున్న అనేక మంది భారతీయులు కరోనా కారణంగా భారత్‌కు వచ్చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత చైనా ప్రభుత్వం కరోనా ఆంక్షలు విధించడంతో అనేక మంది తిరిగి చైనాకు వెళ్లలేక సతమతమయ్యారు. చదువు ఆగిపోయినందుకు బెంబేలు పడ్డారు. ఈ నేపథ్యంలోనే చైనా ఎంబసీ తాజాగా కీలక ప్రకటన చేసింది. ఆగస్టు‌ 24 నుంచీ కరోనా ఆంక్షలు సడలిస్తున్నామని ప్రకటించిన ఎంబసీ.. ఆ తరువాత భారతీయులకు వీసాల జారీ ప్రక్రియను పునఃప్రారంభిస్తామని పేర్కొ్ంది. ప్రస్తుతం సుమారు 23 వేల మంది భారతీయ విద్యార్థులు చైనా వీసా కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో అనేక మంది అక్కడి వైద్యవిద్యను మధ్యలో ఆపేసి భారత్‌కు తిరిగొచ్చారు. చదువులు కొనసాగించాలనుకుంటున్న భారతీయ విద్యార్థుల జాబితాని చైనా గతంలో భారత్‌ను కోరింది. ఈ మేరకు స్టూడెంట్ల జాబితాను భారత్ చైనాకు ఇచ్చింది కూడా. ఇక శ్రీలంక, పాకిస్థాన్, రష్కా దేశాలకు చెందిన విద్యార్థులు ఇప్పటికే చార్టెడ్ విమానాల్లో చైనాకు వెళ్లారు. 

Updated Date - 2022-08-23T05:08:23+05:30 IST